Leading News Portal in Telugu

Abu Dhabi : బీఏపీఎస్ ఆలయంలో భక్త జనసందోహం.. 65 వేల మందికి పైగా దర్శనం



New Project (93)

Abu Dhabi : అబుదాబిలోని BAPS హిందూ దేవాలయాన్ని 65,000 మందికి పైగా యాత్రికులు సందర్శించారు. ఎందుకంటే ఇది తెరచిన తర్వాత మొదటి ఆదివారం కావడంతో భక్తులు పెద్దమొత్తంలో తరలి వచ్చారు. ఆలయం తెరిచిన వెంటనే.. దాదాపు 40 వేల మందికి పైగా పర్యాటకులు బస్సులు, వాహనాల్లో ఉదయాన్నే వచ్చి ప్రార్థనలు చేశారు. సాయంత్రం 25 వేల మందికి పైగా ఇక్కడ పూజలు చేశారు. వాస్తవానికి మొదటి రోజు ప్రార్థనలు చేసేందుకు ఉదయం 40 వేల మందికి పైగా, సాయంత్రం 25 వేల మందికి పైగా బస్సులు, వాహనాల్లో వచ్చినట్లు సమాచారం. భారీ రద్దీ ఉన్నప్పటికీ ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓపికగా క్యూలో నిలబడ్డారు. రోజు చివరిలో 65,000 మందికి పైగా ప్రజలు ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు.

దీంతో ఆలయాన్ని సందర్శించిన భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ బాప్స్ వాలంటీర్లను, ఆలయ సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా అబుదాబికి చెందిన సుమంత్‌రాయ్‌ మాట్లాడుతూ.. వేలాది మంది ప్రజల మధ్య ఇంతటి అద్భుతమైన ఆర్డర్‌ను ఎప్పుడూ చూడలేదు. గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని, ప్రశాంతంగా దర్శనం చేసుకోలేక పోతున్నామని ఆందోళన చెందాను, కానీ అద్భుతమైన దర్శనం చేసుకుని పరమ సంతృప్తి చెందాం. BAPS వాలంటీర్లు, ఆలయ సిబ్బంది అందరికీ వందనాలు.

Read Also:Flipkart UPI: కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా యూపీఐ చెల్లింపులు..

లండన్‌కు చెందిన మరో యాత్రికుడు ప్రవీణా షా కూడా తన ఆలయాన్ని సందర్శించిన అనుభవాన్ని పంచుకున్నారు. నేను వికలాంగుడిని, వేలాది మంది సందర్శకులు వచ్చినప్పటికీ సిబ్బంది చూపుతున్న శ్రద్ధ ప్రశంసించదగినది. జనం గుంపులు గుంపులుగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రశాంతంగా వెళ్లడం నేను చూశాను. విపరీతమైన జనసమూహంలో నేను తప్పిపోతానని అనుకున్నా.. అయితే యాత్రను చక్కగా నిర్వహించడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు.

అబుదాబిలో తొలి హిందూ దేవాలయాన్ని ఫిబ్రవరి 14న ప్రధాని మోడీ ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో యుఎఇ మంత్రి షేక్ నహ్యాన్ మబారక్ అల్ నహ్యాన్ కూడా పాల్గొన్నారు. అబుదాబిలోని BAPS హిందూ దేవాలయం మధ్యప్రాచ్యంలో మొట్టమొదటి సాంప్రదాయ హిందూ రాతి దేవాలయం, భారతదేశం, UAE మధ్య శాశ్వతమైన స్నేహానికి నిదర్శనంగా నిలుస్తుంది, ఇది సాంస్కృతిక సమ్మేళనం, మతాల మధ్య సామరస్యంని సూచిస్తుంది.

Read Also:PM Modi: నేడు తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ.. పలు అభివృద్ధి పనుల ప్రారంభం!