Leading News Portal in Telugu

Bangladesh: బంగ్లాదేశ్‌లో వరదలు.. 13 మంది మృతి


  • బంగ్లాదేశ్‌లో వరదలు.. 13 మంది మృతి

  • నిరాశ్రయులైన 8 లక్షల మంది ప్రజలు
Bangladesh: బంగ్లాదేశ్‌లో వరదలు.. 13 మంది మృతి

బంగ్లాదేశ్‌ను వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా 13 మంది మరణించారు. 4.5 మిలియన్ల మంది ప్రజలు ముంపునకు గురయ్యారు. సహాయ బృందాలు రంగంలోకి దిగి పరిస్థితుల్ని చక్కదిద్దుతున్నారు.

బంగ్లాదేశ్‌లోని అనేక జిల్లాల్లో వరదల కారణంగా కనీసం 13 మంది మరణించారు. 4.5 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. దాదాపు 8 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని విపత్తు నిర్వహణ మరియు సహాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శి కమ్రుల్ హసన్ తెలిపారు. బంగ్లాదేశ్ ఆర్మీ, నేవీ, కోస్ట్ గార్డ్, బోర్డర్ గార్డ్స్, ఫైర్ సర్వీస్, పోలీసులు మరియు ఇతర ఎన్జీవోలు వరద ప్రాంతాల్లో సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. కుమిల్లా, నోఖాలి, బ్రాహ్మణబారియా, చిట్టగాంగ్, కాక్స్ బజార్, సిల్హెట్ మరియు హబిగంజ్ జిల్లాలు వరదల బారిన పడ్డాయి. విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం.. సహాయాన్ని అందించడానికి కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ముంపు ప్రాంతాల నుంచి 188,739 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, బాధిత వర్గాలకు ప్రభుత్వం నగదు, బియ్యం, పొడి ఆహార పదార్థాలను అందజేస్తోందని మంత్రిత్వ శాఖ కార్యదర్శి కమ్రుల్ హసన్ తెలిపారు.

ఇది కూడా చదవండి: Cricket: ఒకే మ్యాచ్లో మూడుసార్లు ‘టై’.. ఇంతకీ ఏ మ్యాచ్ అంటే..?

దేశంలోని తూర్పు ప్రాంతంలోని ఐదు నదులు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయని, బంగ్లాదేశ్ టెలికమ్యూనికేషన్ రెగ్యులేటరీ కమిషన్ (BTRC) డేటా ప్రకారం వరద ప్రభావిత జిల్లాల్లో 14% మొబైల్ టవర్లు ఉన్నాయి. అవి పనిచేయడం మానేశాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లోని షెల్టర్ సెంటర్లలో డ్రై ఫుడ్, డ్రింకింగ్ వాటర్ మరియు టాయిలెట్ సౌకర్యాలను అందిస్తున్నట్లు ప్రపంచంలోనే అతిపెద్ద NGO సంస్థ అయిన డిజాస్టర్ రిస్క్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ లియాకత్ అలీ అన్నారు. ప్రస్తుతం నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Kolkata doctor case: సందీప్ ఘోష్‌కు సీఎం మమత బర్త్‌డే విషెస్ చెప్పిన లేఖ వైరల్