Leading News Portal in Telugu

ఇటలీ కరోనాను ఎలా కంట్రోల్ చెయ్యగలుగుతోంది? ఇలా…

వైరస్‌కు మందు లేదు కాబట్టి… ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ… ఏయే దేశాలు ఎలా కరోనాను కంట్రోల్ చేస్తున్నాయో గమనిస్తున్నాయి. ఇప్పటికే చైనాను అన్ని దేశాలూ ఎలా చేశావ్ అని అడిగేశాయి. ఆ తర్వాత మరికొన్ని దేశాలు కరోనాను కంట్రోల్ చేసినా వాటన్నింటికంటే… ఇటలీ కంట్రోల్ చెయ్యగలగడం అందర్నీ ఆకర్షిస్తోంది. ఎందుకంటే… 2 వారాల కిందటి వరకూ ఇటలీలో కరోనా విజృంభణను చూసిన ఎవరైనా… ఇక ఈ దేశాన్ని ఆ దేవుడే కాపాడాలి అనుకొని ఉంటారు. అలాంటి పరిస్థితి నుంచి ఇటలీ ఇప్పుడు కరోనా అంతు చూస్తోంది. క్రమంగా కేసుల్ని, మృతుల సంఖ్యను తగ్గించుకుంటూ… భవిష్యత్తును ఆశగా చూస్తోంది. ఇదెలా సాధ్యమైందో చకచకా తెలుసుకుందాం.

ప్రస్తుతం ఇటలీలో మొత్తం కేసులు 132547గా ఉండగా… మృతుల సంఖ్య 16523గా ఉంది. సోమవారం కొత్తగా 3599 కేసులు నమోదవ్వగా… 636 మంది చనిపోయారు. ఐతే… ఇటలీలో రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య 2 వారాలుగా తగ్గుతూ వస్తోంది. ఫలితంగా 2 నెలలుగా ఉన్న కఠిన కండీషన్లను త్వరలోనే కొంత సడలిస్తారని అంటున్నారు.

రెండు వారాల కిందటి వరకూ ఇటలీలో… కరోనా వైరస్‌తో చనిపోయే ఛాన్స్ ఉన్నవారికి ట్రీట్‌మెంట్ చెయ్యలేదు కూడా. ఇప్పుడలా లేదు కొంత మెరుగైంది. ఈ మార్పు ఎలా వచ్చిందంటే… మార్చి 9న ఇటలీ లాక్‌డౌన్ ప్రకటించింది. మందులు, ఫుడ్ మార్కెట్స్ తప్ప అన్నీ మూసేసింది. పార్కులు, థియేటర్లు, మాల్స్, క్లబ్బులు, పబ్బులు అన్నీ మూసేసింది. రూల్స్ అతిక్రమించేవారికి 3 నెలల జైలు, భారీ ఫైన్లు వేసింది.
– ఇటలీలో మొదటి కొవిడ్-19 మణం ఫిబ్రవరి 22న జరిగింది. ఇటలీ జనాభా… ప్రపంచ జనాభాలో 1 శాతమే. బట్… ఇటలీలో కరోనా మరణాలు… ప్రపంచ కరోనా మరణాల్లో పావు శాతం ఉన్నాయి.
– ఆదివారం నమోదైన 525 మరణాలు… మార్చి 19 నుంచి చూస్తే… అతి తక్కువ. ఇది వరకూ రోజూ 6000కు పైగా మరణాలుండేవి… ఆదివారం 4316 మాత్రమే నమోదయ్యాయి.
– కొన్ని రోజులుగా ఇటలీలో ఐసీయూ బెడ్లపైకి వచ్చే కరోనా బాధితుల సంఖ్య తగ్గుతోంది.- ప్రస్తుతం ఇటలీలో ఒక వ్యక్తి నుంచి కరోనా… మరో ఇద్దరు లేదా ముగ్గురికి మాత్రమే వ్యాపిస్తోంది.

– జనవరి 31న ఆరు నెలల ఎమర్జెన్సీ ప్రకటించిన ఇటలీ… ఇద్దరు చైనా టూరిస్టులకు కరోనా పాజిటివ్ రావడంతో… చైనా నుంచీ ట్రావెల్‌ను బ్యాన్ చేసింది.
– ఫిబ్రవరిలో ఉత్తర ఇటలీలో… క్వారంటైన్ అమలుచేసి.. దేశాన్ని ఉత్తర, దక్షిణంగా విభజించి… వేర్వేరుగా రూల్స్ అమలు చేసింది. వైరస్ ఎక్కువగా ఉన్న చోట రెడ్ జోన్స్ ప్రకటించింది. వాటి చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఎల్లో జోన్ ప్రకటించింది. జోన్స్‌ని బట్టి శానిటేషన్ లెవెల్స్ అమలు చేసింది. అలాగే ప్రజలు బయటకు రాకుండా చేసింది.
– మార్చి 1న కరోనా కట్టడికి ఓ ప్లాన్, గైడ్‌లైన్స్ సిద్ధం చేసుకుంది.
– మార్చి 9న మొత్తం ఇటలీని రెడ్ జోన్‌గా ప్రభుత్వం ప్రకటించింది.
– కరోనా లక్షణాలు ఉన్న ప్రజలు ఆస్పత్రులకు వచ్చేలా చేసింది. ఎక్కడికక్కడ పోలీసుల్ని పెట్టి… అంతా సోషల్ డిస్టాన్సింగ్ పాటించేలా చేసింది.
– మార్చి 11న ఎమర్జెన్సీ టీంలకు 25 బిలియన్ యూరోలు ఇచ్చింది.
– మార్చి 19న కొన్ని తీవ్ర ప్రాంతాల్లో ఆర్మీని దింపింది. ఫలితంగా లాక్‌డౌన్ బాగా అమలైంది. మూడు నెలల్లో వేల మంది అరెస్టయ్యారు.
– జైల్లో ఖైదీలను కుటుంబ సభ్యులు కలవకుండా చేసింది.
– వారం వారం కఠిన షరతులు విధిస్తూపోయింది. శిక్షలు, ఫైన్లను పెంచేసింది.
– ఏప్రిల్ 1న… ఏప్రిల్ 13 వరకూ లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇటలీలో 23 శాతం మంది జనాభా… 65 ఏళ్లు దాటిన వాళ్లే. ఆ దేశ సగటు వయస్సు 47. చైనాలో 70 ఏళ్లు దాటిన ముసలివాళ్లలో 12 శాతం మందికే కరోనా సోకింది. ఇటలీలో 37 శాతం మందికి సోకింది. ఇటలీలో చనిపోయిన వాళ్లలో చాలా మంది 80 నుంచి 90 ఏళ్ల వాళ్లే. ఐతే… కరోనా బాధితులకు ట్రీట్‌మెంట్ చేస్తూ… ఇటలీలో 80 మంది డాక్టర్లు, 21 మంది నర్సులూ చనిపోయినట్లు లెక్కలున్నాయి. వ్యాక్సిన్ తయారయ్యేవరకూ ఇటలీలో ఇలాగే కండీషన్లు ఉంటాయనీ, క్రమంగా తగ్గిస్తూ వెళ్తామని ప్రభుత్వం తాజాగా చెప్పింది. మన దేశం కూడా కరోనాను కంట్రోల్ చెయ్యాలంటే… కొన్ని షరతులు, లాక్‌డౌన్ల వంటి వాటిని మనం పాటించడమే మేలని ఇటలీ, చైనా పాఠాలు చెబుతున్నాయి.