విదేశీగడ్డ మీద స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష.. బల్గేరియా నుంచి గ్రౌండ్ రిపోర్ట్
యూరోపియన్ దేశాలను కరోనావైరస్ కకావికలం చేస్తున్నా.. బల్గేరియా దేశంలో పరిస్థితి కంట్రోల్ లోనే ఉంది. నేను బల్గేరియా రాజధాని నగరం సోఫియాలో ఉంటాను. ఏదైనా కొనేందుకు వెళ్లినా… ఎక్కడికెళ్లినా మీటర్ దూరంలో ఉండాలి. ఇండియాలో మాదిరిగానే సోషల్ డిస్టెన్సింగ్… పార్క్ ల వద్ద, నదులు వద్ద గుంపులు గుంపులుగా ఉండకూడదు. ఎవరైన నిబంధనలు అతిక్రమిస్తే 2500 యూరోలు జరిమానా విధిస్తున్నారు. జరిమానాలకు చాలా మంది ఇబ్బంది పడ్డారు. కోర్టుకు వెళ్లారు. కోర్టు ఒక్కటే మాట చెప్పాయి. హక్కులు ఉన్నంత మాత్రాన బాధ్యతలు విస్మరించకూడదు అని. దేశంలో 500 పైగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. మిగతా యురోపియన్ దేశాల్లో మాదిరిగా బల్గేరియాలో మెడికల్ ఫెసిలిటీస్ అంతగా ఉడవు. కాబట్టి జాగ్రత్తగా ఉండక తప్పదు. మేం నాలుగు వారాలుగా ఇంట్లోనే ఉంటున్నాం.
ప్రస్తుతం నేను షాపింగ్ మాల్ వద్ద ఉన్నా… వెనక ఎవరూ లేరు.. సాధారణంగా 50, వంద మంది ఉంటారు. జాగ్రత్తగా ఉండాలన్న సిన్సియారిటీ ప్రజల్లో ఉంది… ప్రజల్లో సిన్సియారిటీ లేకుంటే ఏ ప్రభుత్వాలైనా ఏం చేయలేవు. నేను నిత్యావరసర వస్తువుల కొనుగోలుకు వచ్చాను. నేను గ్లౌజ్, మాస్క్ వేసుకున్నాను. మాల్ లోకి వెళ్తే సానిటైజర్ వేసుకోవాలి… ఇది నా రెస్పాన్సిబులిటీ… మా ఇంట్లో మరో ముగ్గురు ఉన్నారు.. నేను ఎక్కడైనా టచ్ చేయొచ్చు. నేను చేసే పొరపాటు కారణంగా ఎదుటి వారు ఇబ్బంది పడొద్దు కదా. ఏ దేశంలో ఉన్నా లా ఆఫ్ ల్యాడ్ ఫాలో చేయాలి.