Leading News Portal in Telugu

Raj tarun case : ప్రతీ సీను…ప్రతీ షాట్…మైండ్ పోతుంది..


  • రాజ్ తరుణ్ పై రెండోసారి కేసు పెట్టిన లావణ్య
  • లావణ్య ఫై ఫిల్మ్ నగర్ పీఎస్ లో పెట్టిన మాల్వి మల్హోత్ర
  • పరస్పరం కేసులతో పోలీసులకు తలనొప్పి
Raj tarun case : ప్రతీ సీను…ప్రతీ షాట్…మైండ్ పోతుంది..

రాజ్ తరుణ్, లావణ్యల కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తనను ప్రేమించి, డబ్బులు తీసుకొని, పెళ్లి చేసుకోమని అడిగినందుకు దూరం పెట్టి, హీరోయిన్స్ తో అక్రమ సంబంధాలు పెట్టుకొన్నాడని, ప్రస్తుతం మాల్వి మల్హోత్రాతో రిలేషన్ లో ఉన్నాడని
నటుడు రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతీ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన సంగతి తెలిసిన విషయమే.కాగా రాజ్ తరుణ్ తనకు దూరం అవడానికి మాల్వి మల్హోత్రా, ఆమె అన్న కారణం అని, కాల్స్ చేసి చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని మీరే ఎలాగైనా తనకు న్యాయం చేయాలనీ రాజ్ తరుణ్, మాల్వి పై రెండో సారి కేసు పెట్టింది లావణ్య.

లావణ్య వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ పలు ఆరోపణలు చేసాడు. లావణ్య గతంలో మస్తాన్ సాయి అనే వ్యక్తిని పెళ్ళిచేసుకోవాలని కేసు పెట్టింది, ఆమె ప్రతీ రోజు డ్రగ్స్ తీసుకుంటుంది. అడ్డు చెప్పినందుకు తనను గొడవ పడింది. డ్రగ్స్ కేసులో జైలు శిక్ష కూడా అనుభవించింది. ఆమె అందరిని బ్లాక్ మెయిల్ చేస్తుందని అన్ని ఆధారాలతో లావణ్యపై కేసు పెడతానని తన వాదనను తెలియజేసాడు. కాగా పోలీసుల దర్యాప్తులో భాగంగా రాజ్ తరుణ్ పై చేసిన ఆరోపణలకు ఆధారాలు సమర్పించమని కోరగా నిన్న రాజ్ తరుణ్ కు సంబంధిచిన ఫోటోలు, వీడియోలు, కాల్ రికార్డింగ్స్ ను పోలీసులకు సమర్పించింది లావణ్య.

ఈ రోజు నటి మాల్వి మల్హోత్రా ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్యపై కేసు పెటింది. తనసై తప్పుడు ఆరోపణలు చేస్తుంది. నా సోదరుడుకి అనుచిత మెసేజ్ లు పంపుతోంది, కాల్ చేసి నోటికొచ్చినట్టు తిడుతోందని లావణ్యపై కేసు ఫైల్ చేసింది. ఇలా ఇద్దరు హీరోయిన్లు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడంతో ఈ కేసు వ్యవహారం పోలీసులకు తలనొప్పిగా మారింది. మల్హోత్రా పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు. ఇలా వాదోపవాదనలు, పరస్పరం కేసులతో ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో.